జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి లో 90 దరఖాస్తులు…

జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి లో 90 దరఖాస్తులు…

 

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి 90 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించి ఆయా దరఖాస్తులు అధికారులకు ఇస్తూ పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్లు విక్టర్ మదన్ మోహన్, సీఈఓ చందర్, ఆర్డీవో వీణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!