*వీధి కుక్కల దాడిలో ఎవరైనా గాయపడితే వాటికి తిండిపెట్టిన వారిదే బాధ్యత: సుప్రీంకోర్టు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
అంత ప్రేమ ఉంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచన
రాష్ట్ర ప్రభుత్వాలే పరిహారం చెల్లించాలని హెచ్చరిక
చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు బాధ్యత వహించాల్సిందే.
వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్న పిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడిచేసి గాయపరిస్తే.. వాటికి తిండి పెడుతున్న వారిదే బాధ్యత అని స్పష్టం చేసింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉంటే వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలని సూచించింది.
వీధి కుక్కల విషయంలో తమ ఆదేశాలను పాటించని రాష్ట్ర ప్రభుత్వాలపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గాయపడ్డ వారికి పరిహారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చెల్లించాలని స్పష్టం చేసింది. చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు తాము నిర్దేశించిన పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్ నాథ్ హెచ్చరించారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


