దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలి.
– దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ పాత తాలూకా కేంద్రంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేలా కృషి చేయాలని బుధవారం దోమకొండ సర్పంచ్ ఐరేణి నరసయ్య ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో కలసి వినతి పత్రం అందజేశారు. దోమకొండ గతంలోనే సమితిగా, తాలూకాగా కొనసాగిందని దోమకొండకు ఒక చరిత్ర ఉన్నట్లు వివరించారు.
ఇన్చార్జి మంత్రి సీతక్క,, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి దోమకొండను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరారు. అలాగే ఈనెల 30న దోమకొండలో నిర్వహించే ఊర పండగ కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, రాష్ట్ర నాయకులు ఇలియాస్ కు మర్యాదపూర్వకం కలిసి విన్నవించారు. ఊర పండుగకు ఇంచార్జ్ మంత్రి సీతక్క హాజరయ్యేందుకు కృషి చేయాలని షబ్బిర్ అలీ తో కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షులు సీతారాo మధు, రాజేందర్, స్వామి, మల్లేశం, శంకర్, సంతోష్, లింగం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


