*చైనా మాంజా అమ్ముతున్న ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు*
-18 వేల విలువగల చైనా మాంజా స్వాధీనం..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జనవరి: 15 (అఖండ భూమి న్యూస్) తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా అమ్మ వద్దని, హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించిన వినకుండా చైనా మాంజ అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులపై బుధవారం ఆర్మూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. గాలిపటాలు అమ్మే షాపుల్లో పోలీసులు తనిఖీ చేయగా సాయి కృష్ణ షాపులో 19 చైనా మాంజ బండిల్స్ లను జప్తు చేసి, నారాయణ, రవిలను అదుపులోకి తీసుకొని విచారించగా నిజామాబాదులో హోల్ సేల్ షాపు యజమాని జహీర్ ఖాన్ అనే వ్యక్తి నుండి చైనా మాంజ ను తీసుకొచ్చినట్లు చెప్పడంతో ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మాంజ విలువ సుమారు 18 వేల రూపాయలు ఉంటుందన్నారు. ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను ఎవరైనా అమ్మితే అలాంటి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


