ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు బంద్..!

*ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులు బంద్..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 19 (అఖండ భూమి న్యూస్);

కేంద్రం కొత్త రూల్

భారతదేశంలో టోల్ విధానంలో మార్పులు చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారి టోల్ ప్లాజాలలో నగదు చెల్లింపులను పూర్తిగా నిషేధించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

టోల్ గేట్ వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, ప్రయాణాన్ని క్రమబద్ధీకరించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు.

ప్రయాణికులు టోల్లు చెల్లించడానికి ఫాస్ట్యగ్ లేదా యూపీఐను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ కొత్త నియమం అమలులోకి వచ్చిన తర్వాత వేగవంతమైన ప్రయాణం, ఇంధన ఆదా, మరియు లావాదేవీలలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!