ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో *గాంధారి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి 58 లక్షల రూపాయల నిధులు మంజూరు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతర కృషి ఫలితంగా, గాంధారి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో
నూతన *కాంపౌండ్ వాల్ నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 58 లక్షల నిధులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ ఓ విడుదల చేసింది.
ఈ నిధుల మంజూరుతో గాంధారి మార్కెట్ యార్డ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడి, రైతులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం ఏర్పడనుంది.
రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే మదన్ మోహన్ చేపట్టిన ప్రయత్నాలకు ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది.
గాంధారి ప్రాంత రైతులు, వ్యాపారులు ఈ నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే మదన్ మోహన్ కి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
You may also like
ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్.. చంద్రబాబుతో కీలక భేటీ …!
కామారెడ్డిలో కాంగ్రెస్కు భారీ మద్దతు…
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…


