ఫరీద్ పేట్ లో ఘనంగా మార్కండేయ జయంతి…

ఫరీద్ పేట్ లో ఘనంగా మార్కండేయ జయంతి…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని తిలకించారు. ఆలయంలో తీర్థ ప్రసాద వినియోగం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ కోల బాలా గౌడ్, మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షులు ఐ .నరహరి, వార్డు సభ్యులు , పద్మశాలి సంఘం సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!