పాల్వంచలో ఘనంగా మార్కండేయ జయంతి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 21 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో స్థానిక మార్కండేయ మందిరంలో బుధవారం మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో భక్తుల సందడితో ఆలయం కిటకిటలాడింది. ఆలయంలో భక్తులు అర్చన, హారతి, తీర్థ ప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం ఆలయం కు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


