నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ ఆదర్శప్రాయుడు – డా.సుధాకర్ గౌడ్

నేటి యువతకు సుభాష్ చంద్రబోస్ ఆదర్శప్రాయుడు – డా.సుధాకర్ గౌడ్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 23 (అఖండ భూమి న్యూస్);

129వ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలోని దక్షిణ ప్రాంగణంలో పరాక్రమ దేవస్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా దక్షిణ ప్రాంగణ ప్రిన్సిపాల్ అయిన డాక్టర్ సుధాకర్ గౌడ్ తో పాటు ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్స్ డాక్టర్ అంజయ్య , డాక్టర్ హరిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అత్యున్నతమైన ఐ.ఏ.ఎస్ పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసి, స్వాతంత్రం కోసం వివిధ దేశాల మద్దతు కోరుతూ ఉద్యమం చేశారని, ఆనాటి యువతకు స్వతంత్ర ఉద్యమంలో ఆజాద్ హిందు ఫౌజ్ స్థాపించి , యువతలో దేశభక్తిని నింపి, స్వాతంత్ర సమరానికి నాంది పలికారు అన్నారు. నేటి యువత వారి ఆశయాల సాధన కోసం. కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మనం చదువుతున్న చదువు సమాజానికి ఉపయోగపడాలనీ సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేసారు. యువత ఆయన ఆదర్శంగా దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ టి ప్రతిజ్ఞ, డాక్టర్.మోహన్ బాబు, డాక్టర్ నారాయణ గుప్తా, డాక్టర్ లలిత, డాక్టర్ నాగరాజు, డా.సబిత ఏపీఆర్ఓ డాక్టర్ సరిత,హాస్టల్ వార్డెన్ డాక్టర్ సునీత, డాక్టర్ రమాదేవి, డాక్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ కనకయ్య, డాక్టర్ విజయ్, మహేందర్, డా.అఫ్రీన్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!