జనగణన-2027 లెక్కలపై బిగ్ అప్డేట్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);
భారత జనగణన-2027 ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ (ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30) అయిన ‘గృహాల జాబితా- గృహ గణన’ కోసం అడిగే ప్రశ్నలతో కూడిన నోటిఫికేషనన్ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి దశలో భాగంగా 33 ప్రశ్నలను అడగనున్నారు. ఇంటి యజమాని వివరాలు, ఇంటి నిర్మాణం, అందుబాటులో ఉన్న సౌకర్యాలతో పాటు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం, స్మార్ట్ఫోన్, వాహనాలు, ఆహార ధాన్యాల వినియోగం వంటి అంశాలను చేర్చారు.


