క్లినికల్ ఎస్టాబ్లిప్లేంట్ 2010 ప్రకారం తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…

క్లినికల్ ఎస్టాబ్లిప్లేంట్ 2010 ప్రకారం తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి…C

 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 24 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా అధికారుల సముదాయం (ఐడిసిసి), కామారెడ్డిలో జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వన్, ఐఏఎస్ అధ్యక్షతన శనివారం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 అమలుపై ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్పనిసరిగా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులపై ఫైన్, పెనాల్టీలు విధిస్తూ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్ఓ ఆదేశించారు. అలాగే అన్‌రిజిస్టర్డ్ ఆసుపత్రుల నివేదికలను డీఆర్ఏ కమిటీకి సమర్పించి, జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ ఆమోదం మేరకు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.

డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది ఆసుపత్రికి వచ్చిన రోగుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, రోగులకు సరైన చికిత్స అందించాలని సూచించారు. రోగుల నుంచి వసూలు చేసే ఫీజులు రిజిస్ట్రేషన్ సమయంలో డీఆర్ఏ కమిటీకి సమర్పించిన ప్రైస్ లిస్ట్ , ప్రొసీజర్‌ల ప్రకారమే వసూలు చేయాలని ఆదేశించారు. అనుమతి పొందిన ఆసుపత్రుల్లో డాక్టర్లు లేదా సిబ్బంది మార్పులు జరిగితే వాటిని తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలియజేయాలని తెలిపారు.

అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో డాక్టర్లకు ఉన్న గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించాలని, ఫీజుల విషయంలో స్పష్టత పాటించాలని సూచించారు. డాక్టర్లకు ఏవైనా సమస్యలు ఉంటే ఐఎంఏ అసోసియేషన్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ప్రతినిధిత్వం అందించవచ్చని తెలిపారు.

డీఎంహెచ్ఓ డాక్టర్ విద్యా మేడం మాట్లాడుతూ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ – 2010 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై రూ.50,000 నుండి రూ.5 లక్షల వరకు జరిమానా విధించడంతో పాటు, అవసరమైతే సీజ్ చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతినెల డీఎంహెచ్ఓ కార్యాలయానికి స్కానింగ్ రిపోర్టులు, సి-సెక్షన్ రిపోర్టులు, అబార్షన్ రిపోర్టులు తదితర అవసరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

సమావేశంలో కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు, తామే రిపోర్టర్లమని చెప్పుకొని పత్రికలు, యూట్యూబ్ చానళ్ల పేరుతో కొందరు ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఏ ఆసుపత్రికి సంబంధించిన విషయాలు ప్రచురించే ముందు ఆసుపత్రి యాజమాన్యం లేదా డాక్టర్ల వివరణ తీసుకున్న తర్వాతే ప్రచురించాలని కోరారు.

ఈ సమావేశంలో శిరీష (పీఓ–డీఆర్ఏ), డాక్టర్ వెంకట్ స్వామి, డెమో వేణుగోపాల్, చలపతి (హెచ్‌ఓ) తదితర అధికారులు, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!