*ఉపాధి హామీ కూలీలకు కీలక అలర్ట్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.
ఇకపై ప్రైవేట్ బ్యాంకు / గ్రామీణ బ్యాంకు ఖాతాల్లో వేతనాలు జమ కావు.
కేవలం జాతీయీకృత బ్యాంకులు, పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే అమౌంట్ జమ అవుతుంది.
గ్రామీణ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్న కూలీలు తప్పనిసరిగా కొత్త ఖాతాలు తెరవాలి.


