త్రివర్ణ పతాకం ఎగరవేసిన షబ్బీర్ అలీ…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 26 (అఖండ భూమి న్యూస్);
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ తన కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకంను సోమవారం ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన కార్యాలయంలో త్రివర్ణ పథకం ని ఎగరవేసి జనగణగమన జాతీయ గీతాన్ని వినిపించారు. అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూ. భారతదేశంలో పుట్టిన దేశభక్తిని ప్రతి ఒక్కరు చాటాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలను తలుచుకున్నారు. వారు చేసే సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇలియాస్ తో పాటు కార్యకర్తలు, ప్రతినిధులు పాల్గొన్నారు.


