కుల సంఘాల ఆధ్వర్యంలో దోమకొండలో ఊర పండగ ప్రారంభం…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 30 (భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఊర పండగ ఐదు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని కుల సంఘాలు ఐక్యతతో శుక్రవారం ప్రారంభమైంది. గ్రామంలో శుక్రవారం ఊరడమ్మ, ముత్యాలమ్మ, నల్ల పోచమ్మ, కట్ట మైసమ్మ, వందలాది సంవత్సరాల క్రితం పురాతన రాతితో నిర్మించిన బురుజు వద్ద గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను పూజించారు. చల్లటి అంబలి చేయడం, ముడుపులు కట్టి, గ్రామ దిగ్బంధం చేశారు. అమ్మవార్లకు తరతరాలుగా చేస్తున్న విగ్రహాలు, రత్నాలు, ఏనుగులు, ఆయుధాలు వంటి వినూత్న తరహాలో అమ్మవారిలకు అలంకరణ చేయడం జరుగుతుంది. సాయంత్రం బోనాలు తీయడం, ఆదివారం గ్రామ పొలిమేరలకు వెళ్లి విందులు చేసుకోవడం జరుగుతుంది. శుక్రవారం స్థానిక చాముండేశ్వరి ఆలయం నుండి పోతరాజుల విన్యాసాలతో, డప్పు వాయిద్యాలతో, రంగసానిల నినాదాలతో ఊరంతా మారు మ్రోగింది. ఐదు రోజులపాటు జరిగే ఊర పండగ ఉత్సవాలు ఎప్పుడు లేని విధంగా దోమకొండ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జరుపుకుంటున్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


