జల్లికట్టు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..

 

 

న్యూఢిల్లీ  అఖండ భూమి వెబ్ న్యూస్ :

సంప్రదాయ క్రీడల అభిమానులకు సుప్రీంకోర్టు గురువారం శుభవార్త చెప్పింది. జల్లికట్టు, కంబల, ఎడ్ల బళ్ల ఆట వంటివాటిని ఇష్టపడేవారికి ఇది ఎగిరి గంతులేసే వార్త..

 

తమిళనాడు (Tamil Nadu)లో జల్లికట్టు, కర్ణాటక (Karnataka)లో కంబల, మహారాష్ట్ర (Maharashtra)లో ఎడ్లబళ్ల పోటీల నిర్వహణకు అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధమైనవేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టానికి ఈ రాష్ట్రాలు సవరణలు చేయడాన్ని సమర్థించింది..

సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో ఈ రాష్ట్రాలు చేసిన సవరణలు సరైనవేనని చెప్పింది. ఈ సవరణలను ‘కలరబుల్ లెజిస్లేషన్స్’ అని చెప్పలేమని తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు, రెండో జాబితాలోని 17వ ఎంట్రీ ప్రకారం ఈ సవరణలను చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవి కుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది..

Akhand Bhoomi News

error: Content is protected !!