పొత్తులపై సీపీఐ నేత రామకృష్ణ క్లారిటీ..

 

విజయవాడ: సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీల పొత్తుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగనున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది..

ఈ క్రమంలో సీబీఐ నేత రామకృష్ణ పొత్తులపై స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలతో తాము కలిసి పనిచేస్తున్నామని అన్నారు. తామందరం కలిసి 2024లో పోటీ చేస్తామని తేల్చిచెప్పారు. బీజేపీతో కలిసి పోటీ చేయద్దని పవన్ కళ్యాణ్‌కు చెపుతామన్నారు. పాచిపోయిన లడ్డులు, మంచి లడ్డులు ఎలా అయ్యాయో పవన్ కళ్యాణ్ చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు..

Akhand Bhoomi News

error: Content is protected !!