ఊర పండగకు విరాళం అందజేత…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 31 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ లో జరుగుతున్న ఊర పండగకు గ్రామానికి చెందిన బోరెడ్డి మంజుల శ్రీనివాస్ రెడ్డి దంపతులు రూ.5116/- విరాళంగా అందజేశారు. గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య కు ఆయన నగదును అందజేశారు. ఊర పండగ అమ్మవార్లకు మొక్కు లోభాగంగా విరాళం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలోఊర పండగ ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్, మర్రి శేఖర్, కూర చంద్రం, సంతోష్ రెడ్డి, సిద్ధారెడ్డి, బాపురెడ్డి, నల్లపు శ్రీనివాస్, గణేష్, నాగరాజ్, పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ తదితరులు పాల్గొన్నారు.


