*తెలంగాణ బిసివై పీఏసీ సభ్యుడిగా గుర్రపు పెద్దకొల్ల జైకుమార్ ముదిరాజ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 1 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి: భారత చైతన్య యువజన పార్టీ (బిసివై) తెలంగాణ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా కామారెడ్డి జిల్లాకు చెందిన గుర్రపు పెద్దకొల్ల జై కుమార్ ముదిరాజ్ ను నియమించారు. పార్టీ సిద్ధాంతాల పట్ల ఆయనకున్న క్రమశిక్షణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపిస్తున్న చొరవను గుర్తించిన బిసివై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.. ఈ నియామకం పట్ల జై కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పీఏసీ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి, ప్రజల గొంతుకగా నిలుస్తానని ఆయన ఉద్ఘాటించారు.


