విజయం దిశగా 10 వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి నీలం కళావతి రమేష్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 09 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి పట్టణంలోని పదవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా నీలం కళావతి రమేష్ ను విజయం దిశగా ప్రచారంలో దూసుకుపోయి ఆఖరి రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పదో వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి బలపరిచి తమ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు. పదో వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి మహిళా ఓటర్లతో భారీ ర్యాలీగా వార్డును చుట్టుముట్టారు. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే ప్రచారంలో దూసుకుపోవడమే కాకుండా ఓటర్లను తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. మొత్తానికి నీలం కళావతి రమేష్ లు సాయంత్రం ఐదు గంటల వరకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


