సీఎం కప్ జిల్లాస్థాయి అర్చరి పోటీలు ప్రారంభించిన సర్పంచ్ ఐరేని నరసయ్య, జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 9 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ గడికోటలోని మైదానంలో సోమవారం సీఎం కప్ జిల్లా స్థాయి అర్చరి పోటీలను దోమకొండ సర్పంచ్ ఐరెని నరసయ్య, జిల్లా అర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తీగల తిరుమల్ గౌడ్ ప్రారంభించారు. రాష్ట్ర ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ కుమార్ సహకారంతో ఈ పోటీలను దోమకొండ లో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇండియన్ రౌండ్ బాలికల విభాగం 30 మీటర్ల జి.సహస్ర, బాలుర విభాగంలో ఎస్.కె.రెహన్ ఎంపికయ్యారు. ఇండియన్ రౌండ్ 40 మీటర్లలో బాలికలు ఎన్.భావన, బాలుర విభాగంలో పిఆర్.రామచరణ్ ఎంపికయ్యారు. రికర్వ్ రౌండ్లో బాలికల విభాగంలో బి.వర్షిణి, పి.నక్షత్ర, బాలుర విభాగంలో నవీన్, ఎస్. స్నేహిత్ ఎంపికయ్యారు. కాంపౌండ్ రౌండ్ 50 మీటర్ల లో శ్రీ వైష్ణవి ఎంపికయ్యారని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన ఈ క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించే సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పిడి నరసింహారెడ్డి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జి, విలువిద్య శిక్షకులు ప్రతాప్ దాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం మధు, నాయకులు మర్రి శేఖర్, సిద్ధ రాములు, రాజేందర్, రమేష్ గౌడ్, జాతీయ క్రీడాకారిణి సింధుజ తదితరులు పాల్గొన్నారు.
You may also like
దేసేయిబీడీ కంపెనీ యజమాని నితిన్ బాయ్ మృతికి సంతాపం
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఎన్నికల సామగ్రిని దగ్గరుండి పరిశీలించిన జిల్లా కలెక్టర్…
1.25 కోట్ల మంది హిందువులు పోరాడాలని నిర్ణయించుకుంటే…!: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..!
రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?.
పబ్జి ఆడుతుండగా 300 దాటిన బిపి మెదడు నరాలు చిట్లి మృతి..!


