మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివరాం మందిర్ ఆలయం…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 11 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏడు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు చుట్టూ ప్రాంతాల ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలివస్తారు. దోమకొండలో 12 తేదీ నుండి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శివరాత్రి మహా సందర్భంగా దోమకొండలో వెలిసిన శివరాం మందిర్ ఆలయంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవాలు, చక్కర తీర్థం, దోమకొండ గడికోట లోని మహదేవుని ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున భక్తుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. గడికోటలో సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారు. ముందస్తుగా ఈ ఉత్సవాల కోసం అదనపు బస్సు సౌకర్యాలతో పాటు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు.


