యూపీలో బాలికలకు ఉచిత స్కూటీ… విద్యకు వేగం ఇచ్చిన గొప్ప నిర్ణయం..!

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 14 (అఖండ భూమి న్యూస్);
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాలికల విద్యను ప్రోత్సహించే దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రాణి లక్ష్మీబాయి స్కూటీ యోజన కింద ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఉచిత స్కూటర్లు అందించేందుకు రూ.400 కోట్లు (రూపాయలు400 కేటాయించింది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య కొనసాగించే అమ్మాయిలకు ప్రయాణ సౌకర్యం సులభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న బాలికలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. మహిళా సాధికారత లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మరింత మంది విద్యార్థినులకు ప్రేరణ కలిగిస్తుంది. బాలికల భద్రత, స్వావలంబన , విద్యాభివృద్ధికి ఇది శుభారంభం. యూపీ ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్న యూపీ ప్రజలు.


