కేవలం 45 పైసలకే రూ.10 లక్షల రైల్వే బీమా…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
భారతీయ రైల్వే ప్రయాణికులకు అత్యంత చౌకైన బీమా సౌకర్యాన్ని అందిస్తోంది. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునేవారు కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా పూర్తి వైకల్యం ఏర్పడినా రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షలు, గాయపడితే ఆసుపత్రి ఖర్చుల కోసం రూ.2లక్షలు అందుతాయి. టికెట్ బుకింగ్ సమయంలో ఈఆప్షన్ను ఎంచుకోవడం మర్చిపోవద్దు.


