ఎస్ఎంఎస్ ల పేరుతో రూ.3,388 కోట్ల వసూలు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 15 (అఖండ భూమి న్యూస్);
గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2023-25) దేశంలోని 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్ఎంఎస్ సేవల ద్వారా ఏకంగా రూ.3,388 కోట్లు వసూలు చేసినట్లు పార్లమెంట్ గణాంకాలు వెల్లడించాయి. అత్యధికంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,188 కోట్లు ఆర్జించింది. SBI మాత్రం 2020 నుంచి ఈ ఎస్ఎంఎస్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయడం గమనార్హం. బ్యాంకులు ప్రతి ఎస్ఎంఎస్కు ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


