*పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి…
*జనసేన పార్టీ నాయకురాలు సరిత మానేకర్..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో జనసేన పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన పార్టీ వీర మహిళ నాయకురాలు సరిత మానేకర్ హాజరై మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు ప్రారంభం కాబోతున్నాయని, లింగంపేట మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో క్రియాశీలక సభ్యత్వాలను తీసుకోవాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జాజారి దినేష్, జీవన్ నాయక్, ప్రసాద్, అరవింద్, మల్లికార్జున్ , సంజీవులు, అనిల్, నర్సింలుతదితరులు పాల్గొన్నారు.


