స్థానిక సంస్థల ప్రక్షాళనకు సిద్ధమైన ప్రభుత్వం….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; ఫిబ్రవరి 23, (అఖండ భూమి న్యూస్);
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుము బిగించింది. ఈ చర్యలలో భాగంగా దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి వ్యవస్థలను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సమాచారం. ప్రస్తుతం ఉన్న మూడంచల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీలు, జడ్పిటిసి లకు నామమాత్రపు అధికారాలే ఉంటున్నాయి అనేది జగమెరిగిన సత్యం. వారి వలన ప్రజలకు సైతం లాభం తక్కువగా ఉందనే అభిప్రాయంతో ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో పెద్ద మార్పు రానుంది అనేది పలువురి అంచనా….


