ప్రజావాణి కి 83 దరఖాస్తులు
జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఫిబ్రవరి 23 (అఖండ భూమి న్యూస్);
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు.
ఈ ప్రజావాణి కార్యక్రమంలో 83 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఆయా శాఖలకు సంబంధించిన భూ సమస్యలు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు కొరకు , ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పేమెంట్ రాలేదని, పంచాయితీ, డిఆర్డిఓ, డి డబ్ల్యు ఓ తదితర వాటి దరఖాస్తులను స్వీకరించి అర్జీదారుని సమస్యను క్లుప్తంగా పరిశీలించి, పరిష్కరించాలని పేర్కొన్నారు.
ఈ గ్రీవెన్స్ లో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, సీఈఓ చందర్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


