*అంబర్ పేటలో సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ అధ్యక్షతన గ్రామసభ…

*అంబర్ పేటలో సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ అధ్యక్షతన గ్రామసభ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఏప్రిల్ 2 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేటలో గ్రామసభ గురువారం నిర్వహించారు. గ్రామ సభకు అధ్యక్షతన వహించిన సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ , ప్రత్యేక అధికారిగా దోమకొండ మండల ఎంపీఓ రవికుమార్ గ్రామ కార్యదర్శి పద్మ,లు ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన, ప్రణాళికలను ప్రజలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. ఈ సమావేశంలో గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, సత్య గౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ వివిధ మహిళా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు, గ్రామ ఏఈఓ మన్యుష, గ్రామ ఏఎన్ఎం డబేరో, గ్రామ లైన్మెన్ సిద్ధగిరి , ఫారెస్ట్ అధికారి ఎఫ్ బి ఓ పద్మ , గ్రామ రేషన్ డీలర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడి కేంద్ర టీచర్లు, స్థానిక SC కాలనీ ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్, ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్ హెడ్మాస్టర్లు, రెవెన్యూ డిపార్ట్మెంట్ జి పి ఓ బాబు , గ్రామం యొక్క ప్రజాప్రతినిధులు, గ్రామ యువత, మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!