ముత్యంపేట ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అండగా నిలిచిన కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్…

ముత్యంపేట ఫోటోగ్రాఫర్ కుటుంబానికి అండగా నిలిచిన కామారెడ్డి జిల్లా ఫోటోగ్రాఫర్స్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 20 (అఖండ భూమి న్యూస్);

వివిధ మండలాల ఫోటోగ్రాఫర్ల నుంచి రూ.1,13,500 ఆర్థిక సహాయం అందజేత

ప్రజావాయిస్ – దోమకొండ

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ బసవరాజు కుటుంబానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు అండగా నిలిచారు. బసవరాజు మరణంతో విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన ఫోటోగ్రాఫర్లు, ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఫోటోగ్రాఫర్లు కలిసి బసవరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మొత్తం రూ.1,13,500 నగదును కుటుంబ సభ్యులకు అందించారు.

మండలాల వారీగా అందించిన సహాయం వివరాలు ఇలా ఉన్నాయి:

దోమకొండ మండల కేంద్రం – రూ.23,500

మాచారెడ్డి మండలం – రూ.21,000

సదాశివనగర్ మండలం – రూ.10,000

బీబీపేట్ మండలం – రూ.5,000

ఇతర మండలాల ఫోటోగ్రాఫర్ల సహకారంతో కలిపి మొత్తం – రూ.1,13,500 సహకారం అందించారు.

ఈ సందర్భంగా పలువురు ఫోటోగ్రాఫర్లు మాట్లాడుతూ, ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఎప్పుడూ తమ సహకారం ఉంటుందని తెలిపారు. సహచరుడి కుటుంబానికి తోడుగా నిలవడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామస్థులు మరియు ఫోటోగ్రాఫర్ సంఘ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని అభినందించారు.

Akhand Bhoomi News

error: Content is protected !!