మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన : కాసాల జనార్దన్ రెడ్డి…!
ప్రతినిధి కురుపాటి గణేష్
(అఖండ భూమి) ఆగస్ట్ 18 చండూరు మండలం…
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం, గుండ్రపల్లి గ్రామానికి చెందిన కాటం ముత్తమ్మ మరణించడం విచారకరమని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసాల జనార్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు..ముత్తమ్మ మరణవార్త తెలిసిన వెంటనే గుండ్రపల్లికి చేరుకున్న ఆయన, ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కాసాల జనార్ధన్ రెడ్డి…అనంతరం ముత్తమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ సానుభూతిని తెలిపారు..ఆమె కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ధైర్యం చెప్పారు..ఈ కార్యక్రమంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భూతరాజు జంగయ్య, పట్ల వెంకన్న, వీరమల్ల అంజయ్య, భూతరాజు వంశీ తదితరులు పాల్గొన్నారు…



