29లోగా రైతు భరోసా కోసం కొత్త రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
తుగ్గలి ఏప్రిల్ 26 (అఖండ భూమి) :
2023-24 సంవత్సరానికి సంబంధించి వైయస్సార్ రైతు భరోసా కోసం కొత్త రైతులు ఈనెల 29వ తేదీ లోగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి పవన్ కుమార్ రైతులకి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూతన రైతులు ఈ నెల 29 తేదీ లోపున వైయస్సార్ రైతు భరోసా కోసం తమ పరిధిలోని గల రైతు భరోసా కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు, 1 బి, బ్యాంక్ అకౌంట్ మరియు మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.
గత సంవత్సరం లబ్ధి పొందిన రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారు. అదేవిధంగా అనర్హులు, మరియు మరణాల కేసుల చెల్లింపులను ఆపడానికి స్టాప్ పేమెంట్ చేసుకోవాలని ఆయన రైతులకు తెలిపారు.కావున అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



