*కళ్ళు పోతున్నాయి…
నరకంగా మారిన రాత్రి ప్రయాణం..!
ప్రమాదాలకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లు..
*సగం లైట్ స్టిక్కర్ నిబంధన జాడలేదు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; మే 23 (అఖండ భూమి న్యూస్);
రాత్రి 7గంటల తరువాత వాహనాలు నడపాలంటే భయమేస్తోంది. ఎదురొచ్చే వాహనాల ఎల్ ఈ డి లైట్స్ వల్ల కళ్లు కనిపించకుండపోతున్నాయి.కొత్తగా వచ్చే వాహనాలు కొత్తగా ఎల్ఈడి లైట్స్ తో వస్తున్నాయి. నియంత్రణ జాడ ఎక్కడ లేదు.
గతం లో వాహనాల హెడ్ లైట్ కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ ఉండాలి అన్న నిబంధన ఉండేది.. అసలు ఆ రూల్ వుందో తీసేసారో కూడా తెలియట్లేదు . ఎల్ఇడి లైట్ ల వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక….కళ్ళు మసకబారి ఏమీ కనపడకుండా పోయి. ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి, కనుక సంబంధిత అధికారులు వాహనాల హెడ్ లైట్స్ ల కు వస్తున్న led లైట్స్ గురించి చర్య తీసుకొని కనీసం హెడ్ లైట్ల కు సగం వరకు బ్లాక్ స్టిక్కర్ కానీ, బ్లాక్ పెయింట్ కానీ వేయాలనే రూల్ ను పునరుద్దరించాలి అని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
You may also like
కాంగ్రెస్ లో చేరిన అంచనూరు ఉప సర్పంచ్…
లోన్ రికవరీ పేరుతో వేధింపులకు అడ్డుకట్ట వేస్తూ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బిఐ…
ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా… బ్యాంకింగ్ సేవలు యథాతథం..!
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పాట్రన్ మెంబర్గా డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి…
పారదర్శక పరిపాలన అందించడమే రేవంత్ రెడ్డి సర్కార్ ధ్యేయం…


