ఓ పెద్దాయన టీ దుకాణంలో కూర్చుని టీ తాగుతున్నాడు. ఆయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది..
చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. అతని జేబులో ఉన్న ఫోన్ సడెన్గా పేలిపోయి మంటలు రావడం మొదలుపెట్టింది. అప్రమత్తమైన అతను వెంటనే ఫోన్ తీసి కింద పడేశాడు. దాంతో అతను ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడ్డాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు ఇలియాస్ను పిలిచి వివరం అడిగారు. ఏడాది క్రితం కొన్న ఫోన్ అని ఇప్పటివరకూ ఎటువంటి ఇబ్బందులు లేవని ఇలియాస్ పోలీసులకు చెప్పాడు..