*అగ్నిపత్ ఆర్మీకి నలుగురు దోమకొండ యువకులు ఎంపిక…

*అగ్నిపత్ ఆర్మీకి నలుగురు దోమకొండ యువకులు ఎంపిక…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 11(అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలo గొట్టుముక్కల దోమకొండ గ్రామాలకు చెందిన నలుగురు యువకులు అగ్నిపత్ ఆర్మీకి ఎంపిక అయ్యారు. వారు బండారు భాస్కర్,కూరపాటి శశాంక్, అబ్రబోయిన రణదీప్, పోతనేని ప్రవీణ్ ఎంపికైన వారిలో ఇద్దరు బండారు భాస్కర్,కూరపాటి శశాంక్ కు ఘనంగా శాలువాతో సన్మానించి స్వీటు తినిపించింన దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్. అనంతరం తిరుమల గౌడ్ మాట్లాడుతూ గతంలో గ్రంథాలయం చైర్మన్ గా పున్న రాజేశ్వర్ ఉన్నప్పుడు దోమకొండ గ్రంథాలయము సందర్శించినప్పుడు విద్యార్థులు కోచింగ్ సంబంధించిన బుక్స్ లేవు అనడం ద్వారా దాతల సహకారంతో ఒక్క లక్ష 80 వేల రూపాయలతో బుక్స్ ల ను దాతల సహకారంతో కొనివ్వడం జరిగిందని మరియు ప్రస్తుతం గ్రంథాలయం చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దోమకొండకు గ్రంథాలయం కు సందర్శించినప్పుడు విద్యార్థుల కోరిక మేరకు మరియు కాంగ్రెస్ యువ నాయకులు ఇలియాస్

ఐ ఫై నెట్వర్క్, అందివ్వడం జరిగిందని మరియు 60 వేల బుక్స్లను దోమకొండ దాతల సహకారంతో కొనివ్వడం జరిగిందని ఈ సందర్భంగా మాట్లాడారు. కోచింగ్ ద్వారా విద్యార్థులు ఎంపిక అవ్వడం ద్వారామాజీ జెడ్పిటిసి తీగల తిరుమాల్ గౌడ్ సంతోషం వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సీతారామ మధు, కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షులు పిన్నం నాగేంద్ర వర్మ, నరసింహులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!