“తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కార్యదర్శిగా బాశెట్టి నాగేశ్వర్.
..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 20 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డిలో జరిగిన ఒక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు కైలాస శ్రీనివాస రావు , ఉత్తర తెలంగాణ రీజియన్ చైర్మన్ శని శెట్టి గౌరీ శంకర్ చేతుల మీదుగా బీబీపేట గ్రామానికి చెందిన భాశెట్టి నాగేశ్వర్ కి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ కార్యదర్శిగా నియామక పత్రాన్ని శనివారం అందించారు.
ఈ సమావేశంలో కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ. పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి , వారి కుటుంబ సభ్యులకు, పిల్లలకు చదువులో గాని వ్యాపారంలో గాని ఆర్థిక స్తోమత కల్పించాలని సమావేశం ఉద్దేశించి మాట్లాడారు.
పేద ఆర్యవైశ్యులకు విద్యలో , ఉపాధిలో ప్రభుత్వపరంగా కోట ఉండాలని శని శెట్టి గౌరీ శంకర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో బీబీపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ యాదగిరి, ఆంజనేయులు, బీబీపేట మండల ఆర్యవైశ్య కార్యదర్శి దుద్దల విశ్వప్రసాద్, బీబీపేట సర్పంచ్ ఉప్పల సాయినాథ్, వాసవి క్లబ్ అధ్యక్షులు మురికి శ్రీనివాస్ ,రెడ్డి శ్రీనివాస్, జోర్రిగల శ్రీనివాస్, తాటిపల్లి రమేష్, అరవపల్లి రమేష్, రామచంద్రం, నీలా బైరయ్య, భాషెట్టి వెంకటేశం, నాఘవేందర్, ఉప్పల మనోజ్, తొడుకునూరి నాగభూషణం, ఆరోపల్లి రాజేందర్, మొగిలిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.


