కాచాపూర్ లో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శ్రీ గంగాదేవి దేవాలయం ప్రతిష్టాపర మహోత్సవం ఉత్సవాలు సోమవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం పోచమ్మకు బోనాలు తీశారు. సోమవారం యాగశాల ప్రవేశం, విగ్రహాల ఊరేగింపు, మంటప ప్రసాదం, 23న అగ్ని ప్రతిష్ట మూలమంత్ర అవణములు, సాయంత్రం విగ్రహాల ప్రతిష్టాపన, హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, 24న చండీ హోమం, విగ్రహాల మహన్నవనం, 25న యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, 26న బోనాల ఊరేగించుట, సాయంత్రం కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఐదు రోజులు జరిగే విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాపుత్ర సంఘం అధ్యక్షుడు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి స్వామి, సాగర సంగం సభ్యులు లక్ష్మీనరసింలు, గౌట శంకర్, గంగాపుత్ర సుదర్శన సభ్యులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


