6 నెలలు ఉచితంగా ఆధార్ ఈమెయిల్ అప్డేట్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 23 (అఖండ భూమి న్యూస్);
ఆధార్ ఈమెయిల్ను 6 నెలలపాటు ఆధార్ మొబైల్ ఏపీపీ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని యు ఐ డి ఏ ఐ తెలిపింది.
ప్రస్తుతం యాప్లో దీని కోసం వినియోగదారులు రూ.75 చెల్లిస్తున్నారు.
అయితే వచ్చే నెల 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ ఛార్జీ వసూలును నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.
అయితే ఇది యాప్ ద్వారా అప్డేట్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
ఆధార్తో మైల్ లింకై ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందవచ్చని చెప్పింది.


