బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి ధైర్యం చెప్పడం తన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పలువురు బాధిత కుటుంబాలను గురువారం పరామర్శించారు.
*లింగంపేట మండలం పరమల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సాయికుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పరమల్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నర్సింహులు భార్య , కుమార్తె ప్రమాదవశాత్తు మృతి చెందిన విషాద ఘటన పట్ల ఎమ్మెల్యే గారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి ఇంటికి వెళ్లి నర్సింహులు ని పరామర్శించి, కుటుంబానికి ధైర్యం చెప్పి తన వంతు ఆర్థిక సహాయం అందజేశారు.
*నాగిరెడ్డిపేట మండలం మల్తుమేధ గ్రామానికి చెందిన ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ అజ్జేమ్ , ప్రమాదవశాత్తు మృతి చెందిన సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం అందిస్తూ పార్టీ తన తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ నేను , తోడుగా ఉంటాం అని ఎమ్మెల్యే తెలిపారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


