*ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
*పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి..
*చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలి..
*గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలి..
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో వేరు వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ. పంటలు విత్తే సమయం ఆసన్నం ఆయన సందర్భంగా ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలనీ, పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలనీ, పంట మార్పిడి ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని అధికారికంగా రైతులకు కలగాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారుల సమీక్షా సమావేశం లో జిల్లా కేంద్రం సహా గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలనీ, చెట్లు మొక్కలు లేకుండా చూడాలని అన్నారు. గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


