*ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
*పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలి..
*చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలి..
*గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలి..
*కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 25 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ అధికారులతో వేరు వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడుతూ. పంటలు విత్తే సమయం ఆసన్నం ఆయన సందర్భంగా ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలనీ, పంట మార్పిడి పై రైతులకు అవగాహన కల్పించాలనీ, పంట మార్పిడి ద్వారా కలిగే లాభాలను రైతులకు వివరించాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దని అధికారికంగా రైతులకు కలగాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
నీటి పారుదల శాఖ అధికారుల సమీక్షా సమావేశం లో జిల్లా కేంద్రం సహా గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీరు వచ్చే పోయే కాలువలు పూడిక తీయించి శుభ్రంగా ఉంచాలనీ, చెట్లు మొక్కలు లేకుండా చూడాలని అన్నారు. గత సంవత్సరం వరదల కారణంగా ఏర్పడిన బుంగలు, అలుగుల మరమ్మత్తులు చేయించాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
You may also like
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…
బాధిత కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే మదన్ మోహన్…


