ముత్యంపేటలో మద్యపాన నిషేధం…
ప్రజల కోరిక మేరకు గ్రామంలో మద్యం నిషేధం..
దోమకొండ ఎక్సైజ్ సీఐ, సివిల్ పోలీస్ స్టేషన్లలో గ్రామస్తుల ఫిర్యాదు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్ గ్రామంలో గ్రామస్తుల ఐక్యవేదికతో మద్యపాన నిషేధం కు గ్రామస్తులు కట్టుబడి సోమవారం నిషేధం విధించారు. గ్రామంలో మద్యపానం నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తూ అదే గ్రామానికి చెందిన పలువురు నిరుపేదలు, రైతులు, కూలీలు మద్యంకు బానిసలై కుటుంబ కలహాలు సృష్టిస్తూ ఆర్థికంగా కుదేలైతున్నట్లు తెలిపారు. గ్రామస్తుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో అందరి కోరిక మేరకు గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు ఐక్యవేదికగా ఏర్పడి మద్యపానం నిషేధం కు సంతకాలు చేశారు. అనంతరం దోమకొండ ఎక్సైజ్ సీఐ, సివిల్ పోలీస్ స్టేషన్లో కార్యాలయలలో మద్యపానం నిషేధం చేస్తూ బెల్ట్ షాపుల నిర్వాహనకు అనుమతులు ఇవ్వకుండా చూడాలని అధికారులను కోరుతూ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంపేట్ గ్రామస్తులు పాల్గొన్నారు.
You may also like
దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
లడఖ్లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
హిందూ విద్యార్థులపై మతమార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…


