అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 29 ( అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లాలో అనుమతులు లేకుండా విద్యాసంస్థలు నడుపుతున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని, వెంటనే అనుమతులు లేని విద్యాసంస్థలు మూసివేయాలని ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి జిల్లా కన్వీనర్ పి. శివప్రసాద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ పార్టీ పుస్తకాలు, పాఠశాలలు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సందర్భంగా మాట్లాడారు. కార్పొరేట్ స్కూల్ లో విద్యాశాఖ అధికారులు ఎలాంటి నిఘా లేకుండా వదిలేస్తున్నారని అన్నారు. ఇలాంటి విద్యా సంస్థలపై పాఠశాల ప్రారంభంలోనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సంపత్ కుమార్, సన్నీ , రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
You may also like
దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
లడఖ్లోని కైగర్ రి పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థినిని సన్మానించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ …
ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ…
ముత్యంపేటలో మద్యపాన నిషేధం…
హిందూ విద్యార్థులపై మతమార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…


