నూతన ఎక్సైజ్ సూపరిండెంట్ను కలిసిన జై గౌడ్ నాయకులు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్);
జిల్లా నూతన ఎక్సైజ్ సూపరిండెంట్గా బాధ్యతలు చేపట్టిన ముకుంద రెడ్డిని జిల్లా జై గౌడ్ ఉద్యమం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల మురళీధర్ గౌడ్, ఉపాధ్యక్షుడు కర్రోల శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మురళి గౌడ్ జిల్లాలో జై గౌడ్ ఉద్యమం తరఫున నిర్వహించిన సేవా కార్యక్రమాలను సూపరిండెంట్కు వివరించారు. అనంతరం ముకుంద రెడ్డి మాట్లాడుతూ, గౌడ సామాజిక వర్గం సంప్రదాయ వృత్తితో పాటు సమాజాభివృద్ధిలోనూ విశేష పాత్ర పోషిస్తోందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గౌడ సంఘాల ప్రతినిధులు నిర్మాణాత్మకంగా చేసే సూచనలను సానుకూలంగా పరిశీలిస్తూ పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ సుందర్ సింగ్, జిల్లా జై గౌడ్ ఉద్యమం బాధ్యులు నర్సగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
You may also like
ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి…
శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో *250 మందికి అన్నప్రసాద వితరణ.
పోలీసు శాఖలో విశిష్ట సేవలు అందించిన నలుగురు అధికారులకు ఘన వీడ్కోలు…
దేమే కలాన్ లో రూ.20 కోట్లతో దేమే కలాన్ పిడబ్ల్యూఓ రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనుమతులు లేని విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలి…


