శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో *250 మందికి అన్నప్రసాద వితరణ.

శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో *250 మందికి అన్నప్రసాద వితరణ...

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూన్ 30 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. అన్న ప్రసాద దాతలుగా పార్శి శ్రీనివాస్ మంజుల ఆర్థిక సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు మాట్లాడుతూ. పార్శి శ్రీనివాస్ మంజుల దంపతులు ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరిగింది వారి కుటుంబానికి ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని సకల సంపదలను అమ్మ భగవానులు అనుగ్రహించాలని ఆలయంలో పూజారులు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సిద్ధంశెట్టి శ్రీనివాస్,రాజమణి,పప్పుల శ్రావణి,పబ్బ జ్యోతి,పాత స్వరూప లు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!