బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…

బీబీపేట వాసవి క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 1 (అఖండ భూమి న్యూస్);

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ డే ను ఘనంగా జరుపుకున్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వాసవి క్లబ్ భవనంలో బచ్చు బైరవి లత చంద్రశేఖర్ ల కూతురు హరిప్రియ, బచ్చు స్వప్న రాజుల కూతురు అనుష ఎంబిబిఎస్ లో ఉత్తీర్ణులై పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొరకు సిద్ధమయ్యాడంతో వీరిని వైద్యుల దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్ తరఫున కాలువ బహుమతులతో ఘనంగా సన్మానించారు. ప్రజలను రక్షించే వైద్యవృత్తిని ఎన్నుకొని వైద్య రంగంలో రాణించడంపై అభినందించారు. వైద్యరంగంలో రాణించి ప్రాణాలను కాపాడే వృత్తిని ఎన్నుకొని ఇతరులకు వైద్యం అందించి ప్రాణాల నిలబెట్టాలని కోరారు. ప్రతి ఒక్కరికి వైద్యులు మార్గదర్శకంగా, ప్రాణాలను కాపాడే వారిగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, రెడ్డిశెట్టి శ్రీనివాస్, వాసవి క్లబ్ వాయిస్ గవర్నర్ బాశేట్టి నాగేశ్వర్, బచ్చు రామచంద్రం, రెడ్డిశెట్టి వెంకటేశం, ఆర్యవైశ్య సంఘం కోశాధికారి తోడుబూసురు శ్రీనివాస్, బచ్చు వెంకటరమణ, సన్మాన గ్రహితులు బచ్చు రాజు, బచ్చు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!