చలో రాజ్ భవన్ కార్యక్రమంలో షబ్బీర్ అలీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు …

చలో రాజ్ భవన్ కార్యక్రమంలో షబ్బీర్ అలీని పంజాగుట్ట పోలీసులు అరెస్టు …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 22 (అఖండ భూమి న్యూస్);

లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) పిలుపునిచ్చిన “చలో రాజ్ భవన్” కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న *రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని* రాజ్ భవన్ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా టీపీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో మంత్రి వివేక్ , ఎమ్మెల్యేలు నవీన్ యాదవ్ , మందుల సామేల్ , శ్రీ శంకర్ , కుంభం అనిల్ కుమార్ రెడ్డి , పలువురు కార్పొరేషన్ చైర్మన్లు , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

రాహుల్ గాంధీ అరెస్ట్ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొంటూ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Akhand Bhoomi News

error: Content is protected !!