హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);
హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్వాగతం
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ, జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ మాధవీ లతలకు జిల్లా కలెక్టర్ పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తులు శనివారం, ఆదివారం రెండు రోజులపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.


