ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…

ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ కార్యకర్తల కృషి అభినందనీయం…

ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతం..

– మహమ్మద్ ఇలియాస్ అలీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు..

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 1 (అఖండ భూమి న్యూస్ భూమి న్యూస్);

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ నాయకత్వంలో, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్) ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడం కార్యకర్తలను శనివారం అభినందించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కే పునాది. ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా ఇంటింటికీ వెళ్లి ఎంతో బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేసి ఎస్ ఐ ఆర్ ప్రక్రియను దాదాపు 100 శాతం విజయవంతం చేసిన అన్ని బి ఎల్ ఓలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు,, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభినందనలు

తెలిపారు.

ఈ విజయానికి మార్గదర్శకులైన మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఏలే మల్లికార్జున్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా నిరంతరం కృషి చేస్తోందనీ అన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి , రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్ అలీ , జిల్లా కాంగ్రెస్ కమిటీ సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, చైర్మన్లు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బి ఎల్ ఓ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

Akhand Bhoomi News

error: Content is protected !!