సిఎంఆర్ ఎల్ ఓ సి చెక్కు అందజేత….
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 4 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చెందిన కంశెట్టి మణెమ్మ కీళ్ల ఆపరేషన్ నిమిత్తం సిఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా గ్రామ సర్పంచి ఐరన్ నరసయ్య రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా వారు 75,000 వేల రూపాయలు సి ఎం ఆర్ ఎల్ ఓ సి మంజూరు చేయించారు. మంగళవారం రోజున కంసెట్టి మన్నెమ్మకు అందజేశారు. స్థానిక సర్పంచ్ ఐరనీ నరసయ్య మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్, మాజీ అధ్యక్షులు అనంతరెడ్డి, పట్టణ టౌన్ అధ్యక్షులు సీతారాం మధు, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు కూర లత సంతోష్, చేనేత చైర్మన్ బత్తిని సిద్ధ రాములు, కటికే శ్రీనివాస్ నయీమ్ తదితరులు పాల్గొన్నారు.


