
అల్లు గుండు గ్రామ ప్రజలకు స్మశాన విస్తీర్ణం పెంచాలని ఎమ్మార్వో రాజేశ్వరి మేడం గారికి సిపిఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రి ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి. కృష్ణ. అల్లు గుండు గ్రామ నాయకులు ఎల్లప్ప చిలిపి కృష్ణలు మాట్లాడుతూ అల్లు గుండు గ్రామంలో ఊరిలోని ఉన్న అన్ని కులాల వారు మరణిస్తే పూడ్చడానికి స్మశానం సరిపోవడం లేదు గ్రామంలో స్మశాన విస్తీర్ణం తక్కువగా ఉన్నందున వలన ఒక శవం పై మరొక శవం పూడ్చే పరిస్థితి ఏర్పడిందని గ్రామంలో జనాభా 1200 మంది పైగా ఉన్న జనాభాకు స్మశానం సరిపోవడం లేదని కాబట్టి స్మశాన విస్తీర్ణాన్ని పెంచాలని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు అన్నారు లేనిపక్షంలో గ్రామ ప్రజలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు చెల్లించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి డి రాజు గ్రామ ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…


