నేటి నుంచి దరఖాస్తులు
టీచర్ల బదిలీలకు షెడ్యూలు విడుదల..
అమరావతి అఖండ భూమి వెబ్ న్యూస్ :
బుధవారం(నేడు) నుంచి శుక్రవారం వరకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలి. 25 ను 27 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 28, 29ల్లో ప్రాథమికంగా సీనియారిటీ జాబితాలు ప్రదర్శించి, 30న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 31, జూన్ 1 తేదీల్లో వాటిని పరిష్కరిస్తారు.
2, 3 తేదీల్లో పాయింట్ల ఆధారంగా తుది సీనియారిటీ జాబితా విడుదల చేస్తారు. 4న ఖాళీలు ప్రదర్శిస్తారు. ప్రధానోపాధ్యాయులు 5, 6 తేదీల్లో, స్కూల్ అసిస్టెంట్లు 5, 6, 7 తేదీల్లో, ఎస్జీటీలు 5 నుంచి 8 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. అనంతరం 9న హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు, 9 నుంచి 11 వరకు ఎస్జీటీలకు తుది బదిలీ జాబితాలు విడుదల చేస్తారు..